Old Parliament building name: ఇక నుంచి పార్లమెంటు నూతన భవనంలోనే ఉభయ సభల కార్యకలాపాలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్ లో మంగళవారం ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం, ర్యాలీగా ఎంపీలు, కూటములవారీగా పాత భవనం నుంచి కొత్త భవనానికి వచ్చారు. బీజేపీ సభ్యులు ప్రధాని మోదీ నాయకత్వంలో పాదయాత్ర చేస్తూ కొత్త భవనానికి వచ్చారు.