పవన్ కల్యాణ్ హర్షం
తెలుగు రాష్ట్రాల్లో గత సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులు గ్లాస్ గుర్తు పైనే పోటీ చేశారు. ఏపీలోని 137 అసెంబ్లీ స్థానాలు, తెలంగాణ నుంచి 7 లోక్ సభ స్థానాలలో జనసేన అభ్యర్థులు పోటీ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ప్రజలకు సేవ చేసేందుకు జనసేన పార్టీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని పవన్ తెలిపారు. ఈ తరుణంలో రిజిస్టర్డ్ పార్టీ అయిన జనసేనకు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించడంపై పవన్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్ర ఎన్నికల సంఘంలోని అధికారులు, సిబ్బందికి పేరు పేరునా జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు అంటూ ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గతంలో జనసేన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం ఫ్రీ లిస్ట్ లో పెట్టిన విషయం తెలిసింది. జనసేనకు ఇకపై గాజు గ్లాస్ గుర్తు ఉండదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం జనసేనకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.