ప్రాథమిక వివరాల ప్రకారం… యాడికి మండలం నిట్టూరులో సోమ్మక్క(47), బాలరాజు(53) దంపతులు నిన్న రాత్రి వారి ఇంటి ముందు నిద్రపోయారు. ఈ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ప్రసాద్(35) అనే వ్యక్తి దంపతులపై కొడవలితో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. వారి పక్కనే నిద్రిస్తున్న కుమార్తెను కూడా హత్య చేయాలని భావించాడు. ఇంతలోనే ఆమె తేరుకోవటంతో… కేకలు వేసింది. అరుపులు విన్న స్థానికులు హత్యకు దిగిన వ్యక్తిని పట్టుకున్నారు. ఈ క్రమంలో ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేయడంతో స్థానికులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో అతడు కూడా చనిపోయాడు. అయితే హంతకుడు ప్రసాద్కు మతిస్థిమితం లేదని తెలుస్తోంది.
BREAKING NEWS