అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధాన సౌధ సమీపంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో రాజ్యాంగ పీఠికను పఠించారు. ఈ సందర్భంగా సీఎం సిద్ధ రామయ్య మాట్లాడుతూ.. ఇకనుంచి రాష్ట్రంలోని ప్రతీ విద్యా సంస్థలో ప్రతీ రోజు రాజ్యాంగ పీఠికను చదవాలని ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులు పరమేశ్వరన్, రామలింగారెడ్డి, కేజే జార్జ్ తదితరులు హాజరయ్యారు.