తొలి రోజు విశాఖపట్నంలో టూర్ ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 2.55 గంటలకు విశాఖలో ఫ్లైట్ ఎక్కితే రాత్రి 8.55 గంటలకు గోవా చేరుకుంటారు. పర్యాటకుల్ని అక్కడ్నుంచి గోవాలోని ప్యారడైజ్ విలేజ్ బీచ్కు తీసుకెళ్తారు. రాత్రికి ఇక్కడే చేస్తారు. రెండో రోజు నార్త్ గోవా టూర్ ఉంటుంది. ఫోర్ట్ ఆగ్వాడా, కాండోలిమ్ బీచ్, బాగా బీచ్ సందర్శిస్తారు. పర్యాటకులు సొంత ఖర్చులతో వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో పాల్గొనొచ్చు. ఆ తర్వాత అంజునా బీచ్, వాగేటర్ బీచ్, చపోరా ఫోర్ట్ కు వెళ్తారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత.. 3వ రోజు ఖాళీ సమయం ఉంటుంది. పర్యాటకులు గోవాలో షాపింగ్ చేయవత్తు. మఫ్సా మార్కెట్, పబ్స్కి వెళ్లొచ్చు. ఇక నాల్గవ రోజు దక్షిణ గోవా టూర్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శిస్తారు. మండోవీ నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయవచ్చు.
BREAKING NEWS