ముగ్గురు మృతి
ఈ ఎన్ కౌంటర్ లో ఆర్మీ కల్నల్, మేజర్, జమ్మూకశ్మీర్ పోలీసు దళానికి చెందిన ఒక అధికారి ప్రాణాలు కోల్పోయారు. గురువారం మధ్యాహ్నానికి కూడా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. రాష్ట్రీయ రైఫిల్స్ 19 కు చెందిన కల్నల్ నాయకత్వంలో ఈ ఆపరేషన్ ప్రారంభమైందని, ముందుడి పోరాడుతున్న ఆ కల్నల్, మరో మేజర్ ఉగ్రవాదుల కాల్పులకు బలయ్యారని ఆర్మీ వెల్లడించింది.