రూ.241 కోట్లు దారిమళ్లింపు
డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్విల్ కార్ను ఈడీ, సీఐడీ గతంలోనే అరెస్ట్ చేసినట్లు సంజయ్ తెలిపారు. సీమెన్స్ సంస్థ తాము డబ్బు పెట్టలేదని సీఐడీకి మెయిల్ పంపిందన్నారు. ఎండీ సుమన్ బోస్ షెల్ కంపెనీలతో చేతులు కలిపారని, తమ విచారణలో తేలిందని సీమెన్స్ సంస్థ చెప్పిందన్నారు. ఏసీబీ కోర్టు ఈ ఆధారాలను పరిశీలించాకే చంద్రబాబుకు రిమాండ్ విధించిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్ వేశామన్నారు. జీవోలకు సంబంధించిన నోట్ ఫైల్స్ ను కూడా కొన్ని లేకుండా చేశారని ఆరోపించారు. సీఎం, సీఎస్ చెప్పడంతోనే నిధులు విడుదల చేశామని పీవీ రమేష్ గతంలో స్టేట్మెంట్ ఇచ్చారన్నారు. ఐదుచోట్ల అచ్చెన్నాయుడు సంతకాలు ఉన్నాయన్నారు. సీమెన్స్ యాజమాన్యానికి కేవలం 58 కోట్లు మాత్రమే ఇచ్చారని మేజిస్ట్రేట్ ముందు చెప్పారన్నారు. ఈ స్కామ్ లో రూ.371 కోట్లను విడుదల చేసి నేరుగా రూ. 241 కోట్లను షెల్ కంపెనీకి దారిమళ్లించారని అభియోగించారు. ముందుగా నిధులు విడుదల చేయడానికి వీలు లేదని నోట్ ఫైల్లో రాసినా నిధులు ఇచ్చారని సీఐడీ చీఫ్ సంజయ్ తెలిపారు.