Tuesday, September 26, 2023

PoK merge with India: ‘‘త్వరలో పీఓకే కూడా భారత్ లో కలుస్తుంది..’’- కేంద్ర మంత్రి-union minister claims pok will merge with india sanjay raut reacts ,జాతీయ


ముందు చైనాను ఆపు..

కేంద్ర మంత్రి వీకే సింగ్ వ్యాఖ్యలపై శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. లద్దాఖ్ లో, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లో భారత భూభాగాన్ని ఆక్రమించిన చైనాను ముందు నిలువరించి, ఆ తరువాత పీఓకే గురించి మాట్లాడాలని రౌత్ వ్యాఖ్యానించారు. చైనా ఇటీవల విడుదల చేసిన మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ ను తమ సొంత భూభాగంగా చూపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మణిపూర్ లో కొనసాగుతున్న హింసను ఆపి,అక్కడ శాంతియుత పరిస్థితులను నెలకొల్పి, ఆ తరువాత పీఓకే గురించి మాట్లాడాలన్నారు. పీఓకే భారత్ లో కలుస్తే తాము కచ్చితంగా స్వాగతిస్తామన్నారు. అఖండ భారత్ తమ స్వప్నమన్నారు. పీఓకేను భారత్ లో కలిపివేసేందుకు, ఆర్మీ చీఫ్ గా ఉన్నప్పుడే జనరల్ వీకే సింగ్ ప్రయత్నించి ఉండాల్సింది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చైనా ఆక్రమణ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే పీఓకే అంశాన్ని ముందుకు తెచ్చారని ఆప్ నేత సౌరభ్ భరధ్వాజ విమర్శించారు.



Source link

Latest news
Related news