Libya floods latest news : లిబియా దేశం రెండుగా చీలిపోయి చాలా కాలం గడిచిపోయింది. ప్రజాసేవకు సంబంధించిన కార్యక్రమాలు.. 2011 నుంచి ఇక్కడ నత్తనడకన సాగుతున్నాయి. ప్రపంచ దేశాలు గుర్తించిన ట్రిపోలీ ప్రభుత్వానికి తూర్పు లిబియాపై పట్టు లేదు. ట్రిపోలీలో ఉన్న ప్రెసిడెన్షియల్ కౌన్సిల్.. సాయం చేయాలని అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంది. “సోదరులు, స్నేహితులు.. అంతర్జాతీయ వ్యవస్థలు వచ్చి మాకు సాయం చేయండి. ఆదుకుంటామని హమీనివ్వండి,” అని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.