ఏపీ ఓటర్ల ముసాయిదా
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్యలో 2019తో పోలిస్తే 5 లక్షలు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఏపీ ముసాయిదా ఓటర్ల జాబితాను గత ఏడాది నవంబర్లో మీనా ప్రకటించారు. నవంబరు 9వ తేదీ నాటికి రాష్ట్రంలో 3,98,54,093 మంది ఓటర్లు ఉన్నారని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రాష్ట్రంలో 2,01,34,621 మంది మహిళా ఓటర్లు ఉండగా 1,97,15,614 మంది పురుష ఓటర్లు ఉన్నారు. సర్వీసు ఓటర్ల సంఖ్య 68,115గా నమోదైంది. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 3858 మందిగా ఉంది. 18-19 ఏళ్ల వయసున్న ఓటర్ల సంఖ్య 68,115గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాలతో 10,52,326 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల ప్రధానాధికారి తెలిపారు. చనిపోయిన వారి ఓట్లు 40,345 ఉండగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు 31,158గా ఉంది. అత్యధిక ఓటర్లతో మొదటి స్థానంలో 19,11,699 ఓట్లతో అనంతపురం నియోజకవర్గం ఉండగా, రెండో స్థానంలో 19,12,049 ఓట్లతో కర్నూలు నియోజకవర్గం, మూడో స్థానంలో 18,98,533 ఓట్లతో నెల్లూరు నియోజకవర్గంలో ఓటర్లు నమోదయ్యారు.