Thursday, September 21, 2023

Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్ పిటిషన్, విచారణ రేపటికి వాయిదా

Chandrababu Case : స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు హౌస్ రిమాండ్‌ పిటిషన్ పై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జైలు రిమాండ్ ను హౌస్‌ అరెస్టుకు మార్చాలని దాఖలైన పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. మంగళవారం మరోసారి ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత చంద్రబాబు హౌస్‌ రిమాండ్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఈ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా వాదనలు సాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. చంద్రబాబుకు జైలులో ప్రాణహాని ఉందని, అందుకే హౌస్ రిమాండ్ మార్చాలని సిద్ధార్థ్ లూథ్రా వాదించారు.

Source link

Latest news
Related news