Tuesday, October 3, 2023

lic claim process, Odisha Train Mishap: ఎల్ఐసీ కీలక నిర్ణయం.. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు ఊరట! – coromandel express accident lic simplifies claim process for odisha train tragedy victims


Odisha Train Mishap: ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంతో యావత్ దేశం ఉలిక్కిపడింది. కోరమాండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురై 280 మందికిపైగా మృతి చెందిన విషయం తెలిసింది. ఈ దుర్ఘటనలో 11 వందల మందికిపైగా తీవ్రగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా శనివారం కీలక నిర్ణయం తీసుకుంది. ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ బాధితులకు భారీ ఊరట కలిగించే ప్రకటన చేసింది. బాధితులకు ఆర్థిక పరమైన రిలీఫ్ కలిగించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో ఉన్న అడ్డంకులను తొలగిస్తున్నట్లు తెలిపింది. త్వరితగతిన ఎల్ఐసీ పాలసీ క్లెయిమ్ సెటిల్‌మెంట్ చేస్తామని తెలిపింది.’ఒడిశా, బాలాసోర్‌లో జూన్ 2, 2023 జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ప్రమాద బాధితులకు అండగా నిలిచేందుకు ఎల్ఐసీ ఆఫ్ ఇండియా కట్టుబడి ఉంది. ఫైనాన్షియల రిలీఫ్ అందించేందుకు క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రాసెస్‌ను మినహాయిస్తున్నాం.’ అని ఎల్ఐసీ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు ఎల్ఐసీ ఛైర్‌పర్సన్ సిద్ధార్థ మోహంతీ కీలక ప్రకటన చేశారు. ఎల్ఐసీ పాలసీ క్లైయిమ్ సెటిల్మెంట్‌లో ఉన్న అడ్డంకులను తొలగించి ఊరట కలిగిస్తున్నట్లు చెప్పారు. ఎల్ఐసీ పాలసీలతో పాటు ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద ఉన్న పాలసీ సెటిల్మెంట్లను సైతం సులభతరం చేస్తామన్నారు.

రిజిస్టర్డ్ డెత్ సర్టిఫికెట్స్, రైల్వే అధికారులు, పోలీసులు లేదా ఏదైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు ప్రకటన చేసిన మరణాల వివరాలను బాధితుల మరణాలకు ప్రూఫ్‌గా స్వీకరిస్తామని ఎల్ఐసీ తెలిపింది. అలాగే డివిజనల్, బ్రాంచ్ స్థాయిలో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటి ద్వారా క్లెయిమ్ సంబంధిత ప్రశ్నల నివృత్తితోపాటు క్లెయిమ్ సెటిల్మెంట్‌లో సహాయం అందిస్తామన్నారు. త్వరితగతిన క్లెయిమ్ సెటిల్మెంట్ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎల్ఐసీ పాలసీదారులు ఏదైనా సందేహం ఉంటే ప్రత్యేక నంబర్ 02268276827 కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చని తెలిపింది.

శుక్రవారం జరిగిన ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 288గా తేలింది. 1100 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాతంలో షాలిమర్- చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బహనగా బజార్ స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. అటుగా వచ్చిన బెంగళూరు- హౌరా సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పిన బోగీలను ఢీకొట్టింది. దీంతో మూడు రైళ్లు ప్రమాదానికి గురయ్యాయి. రెండు రైళ్లలో సుమారు 2000 మంది ప్రయాణికులు ఉన్నట్లు అంచనా.

Coromandel Express: ఘోర ప్రమాదం.. గూడ్స్ రైలు ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్..Coromandel Train Crash: సాంకేతికలోపమా? మానవ తప్పిదమా? ప్రమాదానికి ఏది కారణం?Coromandel Express: ఒకే ట్రాక్‌పైకి రెండు రైళ్లు వచ్చాయా? ఏం జరిగింది? 70 మంది ఏపీ ప్రయాణికులు ఏమయ్యారు?



Source link

Latest news
Related news