మరోవైపు.. భారతీయ క్రియోటివ్ వర్కర్లు 100 శాతం ఈ ఆర్టిఫిషియల్ టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే ఏఐ టెక్నాలజీ అనేది పని ఉత్పాదకతను పెంచుతూ వర్క్ ప్లేస్లో వాల్యూ పెంచుతుందని 1.6 రెట్ల ఇండియన్ మేనేజర్లు సూచించారు. ఉద్యోగులను తొలగించకుండానే దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. మైక్రోసాఫ్ట్ మొత్తంగా 31 దేశాల్లో 31 వేల మందిపై ఈ సర్వే నిర్వహించింది. అందులో 14 ఆసియా దేశాలు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ 365, లింక్డ్ఇన్ లో లేబర్ ట్రెండ్స్ గురించి సర్వే చేసింది. 76 శాతం మంది భారతీయ కార్మికులు తమ పనిని పూర్తి చేయడానికి తమకు తగినంత సమయం, సామర్థ్యం లేదని చెప్పడంతో డేటా, ఇ-మెయిల్స్, చాట్ల పరిమాణం అన్నింటినీ ప్రాసెస్ చేయగల తమ సామర్థ్యాన్ని మించిపోయిందని నివేదిక పేర్కొంది. చాలా మంది సరికొత్తగా ఆలోచించడంలో వెనకబడ్డారని పేర్కొంది.
మైక్రోసాఫ్ట్ 365లో చూసుకుంటే సగటు వ్యక్తి తన టైమ్లో 57 శాతం ఇతరులతో సంభాషించేందుకు వినియోగిస్తున్నాడు. కేవలం 43 శాతం మాత్రమే సరికొత్తగా ఆలోచించేందుకు వెచ్చిస్తున్నాడు. అయితే, భారతీయ వర్కర్లలో 78 శాతం మంది తమ పని దినాల్లో ఎలాంటి ఆటంకం లేకుండా ద్యాస పెట్టడంలో విఫలమవుతున్నట్లు తెలిపారు. ప్రతి నలుగురు భారతీయ లీడర్స్లో ముగ్గురు ఇన్నోవేటివ్గా ఉండడంలో వెనకబడిపోతున్నారు.
- Read Latest Business News and Telugu News