Sunday, June 4, 2023

9 years of modi govt, Modi govt: మోదీ హయాంలో మార్కెట్ల జోరు.. 9 ఏళ్లలో రూ.20 లక్షల కోట్ల లాభం.. గణాంకాలివే! – 9 years of modi govt indian stock market investors richer by rs 20 lakh crore


Modi govt: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం రెండు పర్యాయాల్లో దలాల్ స్ట్రీట్ పెట్టుబడిదారులకు అదృష్టం వరించింది. నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు, కోవిడ్-19 మహమ్మారి వంటి ప్రభావం చూపే అంశాలు ఎదురైనప్పటికీ స్టాక్ మార్కెట్లు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మే 30తో 9 ఏళ్లు పూర్తవుతుంది. ఈ 9 ఏళ్ల కాలంలో దాలాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందాయి. ఈ సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ ఏకంగా రెండున్నర రెట్లు (2.5) మేర పెరగడం గమనార్హం. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రెట్లు పెరిగి రూ.28 లక్షల కోట్లకు చేరింది.2014 నుంచి 2023 వరకు ఈ 9 ఏళ్ల సమయంలో చూసుకుంటే ఫారెన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. మొత్తంగా భారత మార్కెట్లలో 49.21 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు. ఈ 9 ఏళ్లలో విదేశీ ఇన్వెస్టర్లు కేవలం రెండేళ్లు మాత్రమే నికర విక్రయదారులుగా ఉన్నారు. అంటే కోవిడ్ సమయంలో మాత్రమే తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు. మరోవైపు.. దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 9 ఏళ్లలో రూ.7 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. అయితే, కేవలం 2020 కరోనా టైం లోనే నికర విక్రయదారులుగా ఉన్నారు. గడిచిన మూడేళ్ల సమయం చూసుకుంటే 2020లో కరోనా మహమ్మారి తీవ్రంగా దెబ్బకొట్టినా భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా కోలుకుంది. ప్రపంచంలోనే వేగంగా పుంజుకున్న ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. దీంతో దలాల్ స్ట్రీట్ సూచీలు రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. కరోనా నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రభుత్వం తీసుకున్న మానిటరీ చర్యలు, ఆర్థిక పరమైన చర్యలతో ఆర్థిక వ్యవస్థ తిరిగి వేగంగా పుంజుకోగలిగిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

2020 మార్చిలో కరోనా కట్టడి కోసం భారత్ లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. అయితే, ఆ సమయంలోనే నిఫ్టీ 50 రెండింతలు పెరగడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌లో నిఫ్టీ రికార్డు స్థాయిలో సేల్స్ కనబరిచింది. ఎంఎస్‌సీఐ ఎమర్జింగ్ మార్కెట్ ఇండెక్స్‌గా నిలిచింది. 2022లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ద్రవ్యోలబం, ద్రవ్యలోటు ఉచ్చులో చిక్కుకుంటే భారత్ మాత్రమే వేగంగా వృద్ది సాధిస్తోంది. డొమెస్టిక్ మార్కెట్లో నగదు లావాదేవీలు పకడ్బందీగా ఉండడమూ కలిసొచ్చినట్లు చెబుతారు.

మోదీ హయాంలో వివిధ రంగాల పని తీరు ఇలా..

  • ఈ 9 ఏళ్ల కాలంలో నిఫ్టి ఐటీ 219 శాతం మేర రిటర్న్స్ ఇచ్చింది.
  • నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 216 శాతం పెరిగింది.
  • నిఫ్టీ బ్యాంక్ రంగం 190 శాతం లాభాలు ఇచ్చింది.
  • నిఫ్టీ ఎంఎన్‌సీ 186 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 177 శాతం, నిఫ్టీ ఇండియా కన్జంప్షన్ 177 శాతం మేర పెరిగాయి.
  • నిఫ్టీ సర్వీసెస్ సెక్టార్ 170 శాతం, నిఫ్టీ 50 149 శాతం పెరిగింది. నిఫ్టీ ఎనర్జీ 140 శాతం రిటర్న్స్ ఇచ్చింది.
  • నిఫ్టీ ఆటో రంగం 115 శాతం మేర లాభాలు అందించింది.

Multibagger Stocks: లక్ష పెడితే రూ. 3 లక్షలు.. ఏడాదిలోనే దశ తిరిగింది.. ఈ స్టాక్ మీ దగ్గరుంటే లాభాలే లాభాలు!Trending Shares: అంబానీ కంపెనీ అదుర్స్.. టాప్ గేర్‌లో షేరు ధర.. మరో 2 స్టాక్స్ అదే దారిలో!



Source link

Latest news
Related news