బెంగళూరు టీమ్ లీగ్ దశలోనే నిష్క్రమించడంపై కెప్టెన్ డుప్లెసిస్ ఎమోషనల్గా స్పందించారు. ‘‘హైదరాబాద్పై గెలిచిన తర్వాత గుజరాత్తో మ్యాచ్కి ముందు ఆర్సీబీపై అంచనాలు పెరిగిపోయాయి. టేబుల్ టాపర్ గుజరాత్తో ఢీకొంటున్నామని మాకు తెలుసు. కానీ.. గత రెండు మ్యాచ్ల్లో లభించిన జోష్ని ప్లేఆఫ్స్కి చేరేందుకు మేము కొనసాగించలేకపోయాం. గుజరాత్ లాంటి స్ట్రాంగ్ టీమ్తో తలపడేటప్పుడు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాల్సి ఉంటుంది. కానీ నిజాయతీగా చెప్పాలంటే ఐపీఎల్ 2023లో ఉన్న బెస్ట్ టీమ్స్ జాబితాలో మేము లేము. కానీ లక్కీగా మాకు కొన్ని విజయాలు లభించాయి. అయితే ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం.. ప్లేఆఫ్స్కి వెళ్లే అర్హత మాకు లేదు’’ అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2023 సీజన్లో 14 మ్యాచ్లాడిన బెంగళూరు టీమ్ ఏడు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో సీజన్ని ఆర్సీబీ ముగించింది. టీమ్లో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు, డుప్లెసిస్ 8 హాఫ్ సెంచరీలు నమోదు చేసినా బెంగళూరుకి వరుసగా 16వ సీజన్లోనూ టైటిల్ కల నెరవేరలేదు.