ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు
వక్ఫ్ బోర్డు భూమిని బహిష్కృత ప్రాపర్టీస్ నుంచి కలెక్టర్ తొలగించినట్లు ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు వచ్చాయని మహానంది తహసీల్దార్ తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు. ఫోర్జరీ సంతకంతో ఉత్తర్వులు ఇవ్వడంపై పోలీసులు కేసు నమోదుచేశారని, ఈ కేసుపై రెవెన్యూ, పోలీసుల విచారణ చేస్తున్నారని తెలిపారు. నిందితులను త్వరలో పట్టుకుంటారన్నారు.