పృథ్వీ అంబర్, సుమయా రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్పై హీరోయిన్ సుమయా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కథ అందజేసింది కూడా ఆమే కావడం విశేషం. ఆదివారం ఈ మూవీ ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. రచయిత, నిర్మాత కోన వెంకట్ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. విజయ్ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించారు.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయిరాజేష్ మహాదేవ్ మాట్లాడుతూ.. ‘మా టీమ్ను ఎంకరేజ్ చేయటానికి వచ్చిన బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారికి, తోపుదుర్తి ప్రకాష్ గారికి, కోన వెంకట్ గారికి థాంక్స్. ‘డియర్ ఉమ’ అనేది ఓ బాధ్యత గల చిత్రం. మా హీరోయిన్, నిర్మాత అయిన సుమయా రెడ్డి సబ్జెక్ట్ రాసి వినిపించారు. వినగానే ఓ డైరెక్టర్గా బాధ్యతగా ఫీలయ్యాను. అదేవిధంగా మంచి టీమ్ కుదిరింది. రాజ్ తోట, రథన్, రామాంజనేయులు వంటి వారు టెక్నీషియన్స్గా పని చేస్తున్నారు. మా హీరోయినే నిర్మాతగా మారాలని ముందే అనుకునే ట్రావెల్ స్టార్ట్ చేశాం. ఆమె మల్టీ టాస్క్ పర్సనాలిటీ. అందరూ సపోర్ట్ అందిస్తారని భావిస్తున్నాను. దీన్ని పాన్ ఇండియా మూవీగా తీస్తున్నాం. కథపై నమ్మకంతోనే పాన్ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కిస్తున్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో ఓ ఎలిమెంట్ ఈ కథలో ఉంటుంది. సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాం’ అని అన్నారు.
‘డియర్ ఉమ’ సినిమా ప్రారంభోత్సవం
నిర్మాత, హీరోయిన్ సుమయా రెడ్డి మాట్లాడుతూ.. ‘కథ నేను రాసినప్పటికీ నా టీమ్తో కలిసి డెవలప్ చేశాను. మేం కథపై నమ్మకంతో బాధ్యతగా తీసుకుని హీరోయిన్గా, నిర్మాతగా సినిమా చేస్తున్నాను. ప్రతి ఒక ఇంట్లో జరిగిన, జరుగుతున్న కథ ఇది. అందరూ కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. హీరో పృథ్వీ అంబర్ మాట్లాడుతూ.. ‘నేను ముందుగా ‘దియా’ అనే కన్నడ చిత్రంలో నటించాను. తెలుగులోనూ అనువాదమై మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ‘డియర్ ఉమ’ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ‘డియర్ ఉమ’ కథ చాలా బాగుంది. ఫీల్ గుడ్ లవ్ స్టోరి. మంచి మెసేజ్ ఉంటుంది. అందరికీ థాంక్స్’ అని అన్నారు.
కాగా, ఈ చిత్రానికి స్క్రీన్ప్లే, మాటలు, దర్శకత్వం సాయిరాజేష్ మహాదేవ్ అందిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్య గిడుతూరి ఎడిటర్. ఎ.రామాంజనేయులు ఆర్ట్ డైరెక్టర్. కొండా జ్యోతి రెడ్డి కో-ప్రొడ్యూసర్.