Saturday, June 3, 2023

Karate Kalyani: శ్రీ కృష్ణా.. నువ్వు ఉన్నావు స్వామి.. హైకోర్టు తీర్పుపై కరాటే కళ్యాణి!

రాముడు, కృష్ణుడి పాత్రలు పోషించి తెలుగువారి గుండెల్లో నిజంగా దేవుడిగా కొలువుండిపోయిన మహా నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు (NTR). ఈ విశ్వ విఖ్యాత నట సార్వభౌముడి శత జయంతి ఉత్సవాలను (NTR Centenary Celebrations) ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఖమ్మంలో (Khammam) 54 అడుగుల ఎత్తయిన ఎన్టీఆర్ విగ్రహాన్ని (NTR Statue) నిర్మించారు. మే 28న ఆయన శత జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ప్లాన్ చేశారు. కానీ ఈ విగ్రహం కృష్ణుడి రూపంలో (Krishna Avatar) ఉండటం పట్ల టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి (Karate Kalyani) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు మీడియా చానళ్ల డిబేట్లలో పాల్గొని నానా రచ్చ చేసింది. కృష్ణుడికి రూపం లేదా.. మానవ రూపంలో కొలవాలా? అని ప్రశ్నిస్తూ లీగల్‌‌గా ప్రొసీడ్ అవుతున్నట్లు తెలిపింది.

ఈ విషయంలో ‘విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్’ తదితర సంస్థలు కరాటే కళ్యాణికి మద్దతుగా నిలిచాయి. కాగా ఈ వివాదంపై విచారించిన హైకోర్టు తాజాగా స్టే (High Court Stay) విధించిందని కళ్యాణి తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసింది. ‘ఇప్పుడే తీర్పు ఇచ్చారు. 28న విగ్రహం పెట్టకూడదని కోర్టులో జడ్జిగారు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. జై శ్రీ కృష్ణ. నువ్వు ఉన్నావు స్వామి’ అంటూ సదరు పోస్టులో పేర్కొంది. దీంతో మే 28న ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు బ్రేక్ పడినట్లయింది.

అయితే, లీగల్ ప్రొసీడింగ్‌కు ముందు కరాటే కళ్యాణి ఈ విగ్రహ వివాదంపై తన వాదనను మీడియాలో బలంగా వినిపించింది. ‘విగ్రహ ఏర్పాటు విషయంలో శ్రీకృష్ణ భగవానుడిని చాలా ఈజీగా తీసుకుంటున్నారని బాధపడి అక్కడికి వెళ్లి రిప్రెజెంటేషన్ ఇచ్చాం. దీనివల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయని వివరించాం. అందులో భాగంగానే వరుసగా డిబేట్లలో పాల్గొన్నాం. ఒకవేళ విగ్రహం పెట్టినా తప్పకుండా లీగల్ ఫైట్ చేస్తాం. ఆమరణ నిరాహార దీక్షకు కూడా కూర్చుంటామని హెచ్చరించాం. విశ్వ హిందూ పరిషత్, ఇస్కాన్, హిందూత్వ సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి’ అని చెప్పింది కళ్యాణి.

చదువులో చాలా పూర్.. ప్రొడక్షన్‌లో నష్టపోయా: విజయ్

‘మానవ రూపంలో కృష్ణుడిని పెడితే తర్వాత చాలా అనర్థాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక పార్టీలో ఉన్న అభిమానులు కొన్ని రోజులకు వేరే పార్టీకి వెళ్తే హేటర్స్‌గా మారే ప్రమాదం ఉంది. అప్పుడు కృష్ణుడి రూపంలోని ఎన్టీఆర్‌ పోస్టర్‌ను దగ్ధం చేస్తే ఎవరిని దగ్ధం చేశారని అనుకోవాలి. ఈ విగ్రహం 400 ఏళ్లు ఉంటుందని అంటున్నారు. యాభై, ఆరేళ్ల తర్వాత ఫ్యూచర్ జనరేషన్.. తననే కృష్ణుడు అనుకోరా? ఆయనే భగవద్గీత చెప్పారంటే ఎవరు జవాబుదారీ? అంటూ ప్రశ్నించారు.

Latest news
Related news