IPL 2023: ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుకు ఢిల్లీ క్యాపిటల్స్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 46, పృథ్వీ షా 54 పరుగులు చేయగా.. ఆ తర్వాత వచ్చిన రిలీ రొసోవ్.. బౌండరీలతో చెలరేగాడు. 37 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.