Sunday, June 4, 2023

train ticket booking, IRCTC: ట్రైన్ టికెట్ కొనండి.. డబ్బులు ఇప్పుడు కట్టకున్నా పర్లేదు.. ఐఆర్‌సీటీసీ కొత్త సదుపాయం! – buy now pay later for irctc train ticket booking


IRCTC: రైలు ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది ఐఆర్‌సీటీసీ. టికెట్ బుకింగ్ విషయంలో కూడా బై నౌ పే లేటర్ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసం వివిధ ప్లాట్‌ఫామ్స్‌తో చేతులు కలిపింది IRCTC. ఈ సదుపాయంతో ఇప్పుడు ప్రయాణికులు ముందుగా డబ్బులు చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకునే సౌలభ్యం ఉంది. ఇది అత్యవసరంగా ట్రైన్‌లో ప్రయాణించాల్సి ఉన్నప్పుడు.. డబ్బులకు ఇబ్బంది ఉన్నప్పుడు.. ఉపయోగపడుతుంది. అప్పుడు ముందుగా షెడ్యూల్ ప్రకారం టికెట్ తీసుకోవచ్చు. డబ్బులు మాత్రం ఆ తర్వాత చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏమేం మార్గాలు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.ప్రయాణికులకు ఈ సేవలు అందించేందుకు ఐఆర్‌సీటీసీ.. క్యాష్‌ఇ, పేటీఎం, ఈపేలేటర్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. క్యాష్‌ఇ ‘ట్రావెల్ నౌ పే లేటర్’ (TNPL) పేరుతో ఇప్పటికే ఈ సదుపాయం కల్పిస్తోంది. పోస్ట్‌పెయిడ్ కింద పేటీఎంలోనూ ఈ సదుపాయం ఇప్పటికే అందుబాటులో ఉంది. అయితే ఈ ఆప్షన్ ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.

Paytm Postpaid

పేటీఎం తన యూజర్ల కోసం పోస్ట్‌పెయిడ్ సర్వీసుల్ని అందిస్తున్న విషయం తెలిసిందే. తమ యూజర్లకు 30 రోజుల వరకు ఎలాంటి వడ్డీ లేకుండా పేటీఎం రూ. 60 వేల వరకు రుణం ఇస్తోంది. బిల్లింగ్ సైకిల్ ముగిసేలోగా చెల్లిస్తేనే వడ్డీ చెల్లించాల్సిన పని ఉండదు. అవసరమైతే దీనిని ఈఎంఐ గా కూడా మార్చుకునే అవకాశం ఉంది. దీనిని ఉపయోగించుకొని IRCTC లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

FD Rates: శుభవార్త.. వడ్డీ రేట్లు పెంచిన దిగ్గజ బ్యాంక్.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐతో పోలిస్తే అధిక లాభం!

ప్రాసెస్ ఎలా అంటే?

తొలుత ఐఆర్‌సీటీసీ పోర్టల్‌ లాగిన్ కావాలి.
ప్రయాణం ప్రారంభించే ప్రాంతం, గమ్యస్థానం సహా ఇతర ప్రయాణ వివరాలు ఎంటర్ చేయాలి.
బుక్ టికెట్‌పై క్లిక్ చేయాలి.
పేమెంట్ సెక్షన్‌లో పే లేటర్ ఆప్షన్ ఎంచుకొని.. పేటీఎం పోస్ట్‌పెయిడ్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
పేటీఎం లాగిన్ వివరాలతో పాటు OTP ఎంటర్ చేయడంతో టికెట్ బుకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

నేటి బంగారం వెండి ధరలు ఇవే..

క్యాష్‌ఈ ద్వారా ఎలాగంటే?

IRCTC రైల్ కనెక్ట్ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేస్కోవాలి.
ట్రావెలింగ్ వివరాల్ని ఎంటర్ చేసి బుక్ టికెట్‌పై క్లిక్ చేయాలి.
పేమెంట్ ఆప్షన్లలో ట్రావెల్ నౌ పే లేటర్ ఎంచుకోవాలి.
టీఎన్‌పీఎల్ అందిస్తున్న వాటి నుంచి క్యాష్‌ఈ ఎంపిక చేసుకోవాలి.
దీంతో టికెట్ బుకింగ్ పూర్తవుతుంది. నగదును ఈఎంఐల కింద 3 లేదా 6 నెలల పాటు చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
ఈపేలేటర్ అనే ఒక ఫిన్‌టెక్ సంస్థ కూడా ఇదే సదుపాయం కల్పిస్తోంది. ఇక్కడ 14 రోజుల్లోగా టికెట్ డబ్బులు చెల్లించాలి. లేకపోతే 36 శాతం వడ్డీ పడుతుంది.

Visakhapatnam: విశాఖ నుంచి సింగపూర్‌కు ఫ్లైట్.. చాలా తక్కువ ధరకే.. అద్భుతమైన ఆఫర్ త్వరపడండి!



Source link

Latest news
Related news