189 పరుగుల లక్ష్యఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఫస్ట్ నుంచి వరుసగా వికెట్లు చేజార్చుకుంటూ వెళ్లింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (4), అన్మోల్ప్రీత్ సింగ్ (5) సింగిల్ డిజిట్కే ఔటైపోగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ మర్క్రమ్ (10)తో పాటు రాహుల్ త్రిపాఠి (1), సాన్వీర్ సింగ్ (7), అబ్దుల్ సమద్ (4), మార్కో జాన్సెన్ (3) చేతులెత్తేశారు. దాంతో 9వ ఓవర్లు ముగిసే సమయానికి 59/7తో నిలిచిన హైదరాబాద్ కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. కానీ.. మిడిల్ ఓవర్లలో ఒంటరి పోరాటం చేసిన హెన్రిచ్ క్లాసెన్ (64: 44 బంతుల్లో 4×4, 3×6).. భువనేశ్వర్ కుమార్ (27: 26 బంతుల్లో 3×4)తో కలిసి దూకుడుగా ఆడాడు. అయితే ఈ జంట మ్యాచ్ని గెలిపించలేకపోయింది. కానీ.. ఓటమి అంతరాన్ని మాత్రం తగ్గించగలిగింది. లాస్ట్లో మయాంక్ మార్కండే కూడా 9 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 18 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ నాలుగేసి వికెట్లు పడగొట్టి హైదరాబాద్ పతనాన్ని శాసించారు. యశ్ దయాల్ ఒక వికెట్ తీశాడు.
మ్యాచ్లో అంతకముందు యంగ్ ఓపెనర్ శుభమన్ గిల్ (101: 58 బంతుల్లో 13×4, 1×6) సెంచరీ బాదడంతో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ టీమ్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శుభమన్ గిల్తో పాటు సాయి సుదర్శన్ (47: 36 బంతుల్లో 6×4, 1×6) చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో భువనేశ్వర్ 5 వికెట్లు పడగొట్టేశాడు. అలానే మార్కో జాన్సెన్, ఫరూఖి, టి. నటరాజన్ ఒక్కో వికెట్ తీశారు.