Next BRS meeting in Maharashtra: సంక్షేమ పథకాలు
ఇప్పటివరకు మహారాష్ట్రలో కేసీఆర్ (KCR) పాల్గొన్న మూడు సభలు విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి 5న నాందేడ్ లో, మార్చి 26న నాందేడ్ జిల్లాలోని కాంధర్ లోహా లో, ఏప్రిల్ 24న ఛత్రపతి శంభాజీ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, అత్యాచారాలు వంటి సమస్యలపై కేసీఆర్ (KCR) ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒంటరిగానే పోటీ చేస్తుందని కేసీఆర్ (KCR) ఇప్పటికే ప్రకటించారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ (Ab ki Baar Kisan Sarkar)’ నినాదంతో రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో బరిలో దిగుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర మీడియాకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వ విజయాలను ఆ ప్రకటనల్లో వివరిస్తోంది.