Noida woman buried : పెళ్లై 7ఏళ్లు గడిచినా.. ఆ మహిళ కట్నం వేధింపులకు గురవుతూనే ఉంది. 15 రోజుల క్రితం అదృశ్యమైంది. చివరికి.. ఆమె మృతదేహం లభించింది. కుక్కలు పీక్కు తింటున్న దశలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మహిళ భర్త తరఫు కుటుంబమే.. ఆమెను చంపేసిందని ఆరోపణలు ఉన్నాయి.