Thursday, June 1, 2023

poop samples, మలమూత్రాలు ఇస్తే రోజుకు రూ.40 వేలు.. అవునండీ ఇది నిజమే! ఈ కంపెనీ ఆఫర్ ఏమిటంటే? – human microbes offers over rs 40000 for human excreta


Human Excreta: ఆహారం తీసుకున్న తర్వాత అది జీర్ణం అయ్యాక మిగిలిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఖాళీ చేసుకోవాలి. లేదంటే అనారోగ్యాలకు గురవుతామని తెలుసు. ప్రతి రోజు ఉదయం పొట్టను ఖాళీ చేసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, అదే మలమూత్రాలతో కూడా డబ్బులు సంపాదించవచ్చని మీరెప్పుడైన ఊహించి ఉంటారా? అవునండీ అది నిజమే, అమెరికా, కెనడా ప్రాంతాల్లో పని చేస్తున్న ఓ కంపెనీ మానవ మల విసర్జాలకు రోజుకు 500 డాలర్లు ఆఫర్ చేస్తోంది. అంటే భారత కరెన్సీలో అది రూ.41 వేలకుపైనే ఉంటుంది. హ్యూమన్ మైక్రోబ్స్ (Human Microbes) మల్టిపుల్ డొనేషన్స్‌ను సైతం ప్రోత్సహిస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా పూప్ శాంపిల్స్‌ను (మలమూత్రాల నమూనాలు) (Poop Samples) తీసుకుంటోంది.కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. ‘ మీరు ప్రతి రోజు మరుగుదొడ్డికి వెళ్లగలిగితే అది ఏడాదికి 1,80,000 డాలర్ల విలువ ఉంటుంది. ‘ అని పేర్కొంది. కేవలం టాయిలెట్‌కి వెళ్లడం ద్వారానే ఏడాదికి రూ.1.5 కోట్లు సంపాదించవచ్చన్నమాట. ఇంకేముంది?డబ్బు మీకు సరిపోకపోతే మీరు మీ సొంత ధరను సెట్ చేసుకోవచ్చు అని తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. అయితే, మీరు మలమూత్రాలు అందించి డబ్బులు సంపాదించాలంటే ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే, దానికి అయ్యే ఖర్చును కంపెనీనే భరిస్తుంది.

దాతలకు కంపెనీ ముందస్తు చెల్లింపులు కూడా చేస్తుంది. ఆ తర్వాత దాతలు విలువైన కార్గో డ్రై ఐస్ షిప్పింగ్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఇంకేముంది దీనిని ఉపయోగించుకుని డబ్బులు సంపాదించుకోండి. అంతేకాదండోయ్ హ్యూమన్ మైక్రోబ్స్ దాతల వివరాలను గోప్యంగా ఉంచుతుంది. మీరు ప్రైవసీని కొనసాగించేందుకు దాతల వివరాలను పూర్తంగా గోప్యంగా ఉంచతామంటూ వెబ్‌సైట్‌లో పేర్కొంది.

మానవ మలంతో కంపెనీ ఏం చేస్తుంది?
మనుషుల్లో తరతరాలుగా హోస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు అనేవి తగ్గిపోతున్నాయి. ఈ సూక్ష్మజీవులను కలిగి ఉన్న వారు 0.1 శాతం కన్నా తక్కువ మంది ఉన్నారు. వారిని గుర్తించి వైద్యులు, పరిశోధకులు, ఆసుపత్రులు, క్లినికల్ ట్రయల్స్‌కు అందించడమే లక్ష్యంగా హ్యూమన్ మైక్రోబ్స్ పని చేస్తోంది. అలా హెస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు కలిగి ఉన్న వారి కోసం కంపెనీ వెతుకుతోంది. దీని ద్వారా అధిక నాణ్యత గల మలం దాతలను పరిశోధకులతో కనెక్ట్ చేయవచ్చు. ప్రస్తుతం ప్రజలు పెద్ద సంఖ్యలో అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే, హోస్ట్ నేటివ్ సూక్ష్మజీవులు తరాలు మారుతున్న క్రమంలో తగ్గిపోతూ వస్తుండడం ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతోంది. అయితే, ఎవరైతే ఈ సూక్ష్మ జీవులను కలిగి ఉన్న ఆరోగ్య వంతులను మలాన్ని సేకరించడే కంపెనీ లక్ష్యం.



Source link

Latest news
Related news