Thursday, June 1, 2023

hindenburg research, Jack Dorsey: హిండెన్‌బర్గ్ మరో దెబ్బ.. బ్లాక్‌పై సంచలన రిపోర్ట్.. ఒక్కరోజే వేల కోట్లు కోల్పోయిన జాక్ డోర్సే! – jack dorseys wealth tumbles 526 million dollars after hindenburg accuses block of fraud


Jack Dorsey Block: గతంలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్.. మరోసారి సంచలన రిపోర్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సారి ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సేకు చెందిన పేమెంట్స్ కంపెనీ, మొబైల్ బ్యాంకింగ్ సంస్థ బ్లాక్‌ను (Block) లక్ష్యంగా చేసుకుంది. ఇందులోని నిర్వాహకులు పెద్ద ఎత్తున అక్రమాలు చేశారంటూ సంచలన నివేదిక బయటపెట్టింది. దీంతో బ్లాక్ షేరు ధర ఒక్కరోజే 20 శాతం వరకు పతనమైంది. ఇక ఈ రిపోర్ట్‌ను కూడా రెండేళ్లకుపైగా పరిశోధన చేసి రూపొందించినట్లు వివరించింది. ఇదే క్రమంలో సంస్థ షేరు పతనం కాగా.. జాక్ డోర్సే సంపద కూడా భారీగా పడిపోయింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. గురువారం ఒక్కరోజే ఆయన వ్యక్తిగత సంపద 526 మిలియన్ డాలర్లు భారత కరెన్సీలో సుమారు రూ.4 వేల కోట్లకుపైనే ఆవిరైంది. గతేడాది మే నుంచి ఒక్కరోజులో ఈయన అత్యధిక సంపద పతనం ఇదే. ప్రస్తుతం ఆయన సంపద 11 శాతం పడిపోయి 4.4 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ట్విట్టర్‌తోనూ అనుబంధం ఉన్న డోర్సే సంపద మాత్రం ఎక్కువగా బ్లాక్‌తోనే ముడిపడి ఉంది. ఇందులోనే ఆయన సంపద సుమారు 3 బిలియన్ డాలర్ల వరకు ఉన్నట్లు బ్లూమ్‌బెర్గ్ వెల్త్ ఇండెక్స్ అంచనా వేస్తోంది. ఇక ట్విట్టర్‌లో తన పాత్రకు గానూ అక్కడ సంపద 388 మిలియన్ డాలర్ల వరకు ఉంది.

బ్లాక్ సంస్థ ఫౌండర్లతో పాటు ముఖ్య ఆర్థిక అధికారి అమృతా అహుజా, మేనేజర్ బ్రెయిన్ కూడా సంస్థ షేరుపై మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపించింది హిండెన్‌బర్గ్. ఇక ఖాతాదార్ల సంఖ్య ఎక్కువగా చూపుతూ.. సంస్థ షేరు విలువను కూడా కృత్రిమంగా పెంచుకుంటూ పోతూ బ్లాక్ మేనేజ్‌మెంట్.. ఇన్వెస్టర్లను, ప్రభుత్వాన్ని మోసగించినట్లు హిండెన్‌బర్గ్ ఆరోపిస్తోంది.

Upasana Kamineni: Ram Charan సతీమణి ఉపాసన మరో ఘనత.. ఎకనామిక్ టైమ్స్ ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్‌గా..Billionaires India: భారత్‌లో ఎక్కువ మంది బిలియనీర్లు ఉంది ఈ నగరంలోనే.. వార్నీ ఒకే చోట ఇంత మందేంటి?

ఇంకా నిబంధనలన్నీ అతిక్రమిస్తూ.. బ్లాక్ కంపెనీ రుణాల పేరుతో దోపిడీ చేస్తోందని, విప్లవాత్మక సాంకేతికత పేరుతో కంపెనీ గణాంకాలను తప్పుగా చూపించడం ద్వారా అంటే కృత్రిమంగా షేరు విలువను పెంచి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టిస్తుందని చెబుతోంది హిండెన్‌బర్గ్.

ఇక హిండెన్‌బర్గ్ రీసెర్చ్ జనవరి 24న గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ టార్గెట్‌గా రిపోర్ట్ వదిలిన సంగతి తెలిసిందే. అప్పుడు కొద్దిరోజుల వ్యవధిలోనే గ్రూప్ మార్కెట్ క్యాప్ ఏకంగా 140 బిలియన్ డాలర్ల వరకు పతనమైంది. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ కూడా ఒక దశలో రెండులో ఉండేవారు. తర్వాత 40కి కూడా పడిపోయారు. ఇక ఇటీవల షేర్లు పుంజుకుంటుండగా ప్రస్తుతం 21లో కొనసాగుతున్నారు.

మరో బాంబ్ పేల్చిన Hindenburg.. ఈసారి ‘జాక్ డోర్సే’ వంతు.. కుప్పకూలిన కంపెనీ షేర్లు!ఐటీ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. 19 వేల మందిని తొలగిస్తున్న దిగ్గజ కంపెనీ.. కోత మళ్లీ మొదలైంది!



Source link

Latest news
Related news