ఆస్ట్రేలియా చేతిలో రెండో వన్డేలో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా.. ఓ చెత్త రికార్డ్ని కూడా మూటగట్టుకుంది. విశాఖపట్నం వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 26 ఓవర్లలోనే 117 పరుగులకి ఆలౌటైంది. ఆ తర్వాత ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్ 11 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా 121/0తో లక్ష్యాన్ని ఛేదించేసింది. ఇక లాస్ట్ వన్డే మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా బుధవారం జరగనుంది.
భారత్పై వన్డేల్లో ఓ జట్టు 11 లేదా అంతకంటే తక్కువ ఓవర్లలోనే గెలుపొందడం ఇదే తొలిసారి. 2019 నుంచి ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరిట ఉంది. ఆ ఏడాది భారత్ జట్టు 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్కి నిర్దేశించగా.. ఆ జట్టు 14.4 ఓవర్లలోనే ఛేదించేసింది. తాజాగా ఆ చెత్త రికార్డ్ని ఆస్ట్రేలియా టీమ్ 11 ఓవర్లలోనే ఛేదించేసి మరింత మెరుగుపర్చింది. ఓవరాల్గా ఆస్ట్రేలియా టీమ్కి ఇది మూడో అతి పెద్ద గెలుపు. భారత్కి మాత్రం ఇది అవమానకర ఓటమి.
విశాఖ వన్డేలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 8 ఓవర్లు వేసి 5 వికెట్లు పడగొట్టగా.. బ్యాటింగ్లో మిచెల్ మార్ష్ (66 నాటౌట్), ట్రావిస్ హెడ్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. భారత్ తరఫున విరాట్ కోహ్లీ (31) మాత్రమే టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లు ఎవరూ కనీసం ఒక వికెట్ కూడా తీయలేకపోయారు.
Read Latest Sports News, Cricket News, Telugu News