మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ స్నేహ్ రాణా బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఓపెనర్ సోఫియా డంక్లీ (16: 10 బంతుల్లో 3×4) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయింది. కానీ.. నెం.3లో బ్యాటింగ్కి వచ్చిన సబ్బినేని మేఘన (31: 32 బంతుల్లో 4×4)తో కలిసి మరో ఓపెనర్ లూరా దూకుడుగా ఆడేసింది. ఆ తర్వాత వచ్చిన గార్డ్నర్.. చివర్లో హేమలత (16 నాటౌట్: 6 బంతులో 2×4, 1×6), హర్లీన్ డియోల్ (12 నాటౌట్: 5 బంతుల్లో 1×4, 1×6) బ్యాట్ ఝళిపించారు. దాంతో గుజరాత్ మెరుగైన స్కోరుని అందుకోగలిగింది.
ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన స్కాట్ బౌలింగ్లో హర్లీన్ డియోల్ ఒక ఫోర్, సిక్స్ కొట్టగా.. హేమలత కూడా ఒక ఫోర్, సిక్స్ కొట్టింది. దాంతో ఓవరాల్గా ఆ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. మ్యాచ్లో ఈ ఓవర్ కీలకంకాబోతోంది. ఇప్పటికే డబ్ల్యూపీఎల్ 2023 ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టంగా మార్చుకున్న బెంగళూరు ఈ మ్యాచ్లో ఓడితే? సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించనుంది.
Read Latest Sports News, Cricket News, Telugu News