ఘోర రోడ్డు ప్రమాదం…
Road accident at Sri Sathya Sai district: ఏపీలోని సత్యసాయి జిల్లాలో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. బత్తలపల్లి మండలం పోట్లమర్రి వద్ద ఆటోను బొలెరో ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆటో, బెలెరో చాలా వేగంతో ఎదురెదురుగా ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అక్కడికక్కడే ఐదుగురు చనిపోగా…మరొకొరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు.