Delhi liquor scam: సౌత్ గ్రూప్ లో ఎవరు?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ గా పేర్కొంటున్న బృందంలో వైఎస్సార్సీపీ నేత, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ, శరత్ రెడ్డి, కే కవిత, సమీర్ మహేంద్రు ఉన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలోని సంబంధిత వ్యక్తులతో సంప్రదింపుల కోసం వీరికి అభిషేక్ బోయినపల్లి, అరుణ్ పిళ్లై, గోరంట్ల బుచ్చిబాబు ప్రతినిధులుగా వ్యవహరించారని ఈడీ ఆరోపిస్తోంది.