Spike in Covid cases: ఆరు రాష్ట్రాల్లో..
తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో గత రెండు వారాలుగా కరోనా (corona) కేసుల సంఖ్యలో స్వల్ప పెరుగుదల నమోదైంది. అందువల్ల వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి స్థానికంగా చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఆయా రాష్ట్రాలకు రాసిన లేఖలో సూచించారు. క్షేత్ర స్థాయిలో కొరోనా (corona) కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలించాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొరోనా (corona) కట్టడికి ముఖ్య ఆయుధాలైన మాస్క్, భౌతిక దూరం, పరిశుభ్రత పాటించేలా ప్రజలకు మరోసారి అవగాహన కల్పించాలన్నారు.