తొలి వన్డే ముంగిట తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య స్థానంలో విరాట్ కోహ్లీ స్పీచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తుది జట్టుపై కూడా కోహ్లీ నిర్ణయాల్ని ప్రకటించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో హార్దిక్ పాండ్యతో పాటు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా మౌనంగా చూస్తుండిపోయారు. వన్డేల్లో భారత్ జట్టుని కెప్టెన్గా హార్దిక్ పాండ్య నడిపిస్తుండటం ఇదే తొలిసారి.
2017 నుంచి 2021 చివరి వరకూ వన్డేల్లో భారత్ జట్టుని కెప్టెన్గా విరాట్ కోహ్లీ నడిపించాడు. కానీ.. ఆ తర్వాత కేవలం 4 నెలల వ్యవధిలోనే టీ20లతో పాటు వన్డే, టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ గుడ్ బై చెప్పేశాడు. ఆ తర్వాత మళ్లీ కెప్టెన్గా కనీసం ఒక్క మ్యాచ్లో కూడా వ్యవహరించలేదు. రోహిత్ శర్మ టీమ్లో ఉంటే కేవలం బ్యాటింగ్, ఫీల్డింగ్కే కోహ్లీ పరిమితమవుతున్నాడు. లీడర్షిప్ గ్రూప్లో పెద్దగా కనిపించడం లేదు.
Read Latest Sports News, Cricket News, Telugu News