Friday, March 31, 2023

TTD: త్వరలోనే చెన్నై శ్రీవారి ఆలయ పునర్నిర్మాణం – టీటీడీ ఛైర్మన్

ఆలయంలో శుక్రవారం ఉదయం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి సమక్షంలో ప్రాణప్రతిష్ట, మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని అన్నారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం ప్రారంభమవుతుందని ప్రకటించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం తరహాలోనే ఇక్కడ నిత్య కైంకర్యాలు, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తామన్నారు. కాగా, గురువారం ఉదయం చతుష్టానార్చన, మూర్తిహోమం, ప్రాయశ్చిత్తం, పూర్ణాహుతి, ధ్వజస్తంభ ఛాయ జలాధివాసం, బింబ నయనోన్మీలనం నిర్వహించారు. సాయంత్రం శయనాధివాసం చేపట్టారు. టీటీడీ పాంచరాత్ర ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

Source link

Latest news
Related news