Sunday, April 2, 2023

‘శ్రీ రామాయణ యాత్ర’ కు భారత్ గౌరవ్ ట్రైన్-indian railways bharav gaurav train to embark on 18 day shri ramayana yatra on april 7


Bharat Gaurav train: శ్రీ రామాయణ యాత్ర విశేషాలు..

ఏప్రిల్ 7 న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ఈ Bharat Gaurav Deluxe AC tourist train ట్రైన్ శ్రీ రామాయణ యాత్ర (Shri Ramayana Yatra) కు బయల్దేరుతుంది. 18 రోజుల యాత్ర అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది. ఈ యాత్రలో భాగంగా మొదట అయోధ్య చేరుకుంటుంది. అక్కడ భక్తులు శ్రీరామ జన్మభూమి ఆలయం, హనుమాన్ ఆలయం, సరయు హారతి లను దర్శించవచ్చు. అక్కడి నుంచి సీ బిహార్ లోని సీతామర్హి కి వెళ్తారు. అక్కడ సీతాదేవి జన్మస్థలంగా భావించే ప్రాంతాన్ని, నేపాల్ లోని జానకిపూర్ లో ఉన్న రామజానకి ఆలయాన్ని రోడ్డు మార్గాన సందర్శిస్తారు. ఆ తరువాత వరుసగా బక్సర్ లోని రామ్ రేఖా ఘాట్, రామేశ్వరనాథ ఆలయం, గంగానదీ స్నానం మొదలైనవి ఉంటాయి. అక్కడి నుంచి వారణాసి, ప్రయాగరాజ్, చిత్రకూట్ లను సందర్శిస్తారు. అక్కడి నుంచి నాసిక్, హంపి, రామేశ్వరం మీదుగా భద్రాచలం చేరుకుంటారు. అక్కడి నుంచి చివరగా నాగపూర్ వెళ్తారు. అనంతరం తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. మొత్తంగా ఈ (Shri Ramayana Yatra) ప్రయాణంలో 7500 కిమీలు ప్రయాణిస్తారు.



Source link

Latest news
Related news