Friday, March 24, 2023

finance ministry on adani crisis, Adani: పార్లమెంట్ సాక్షిగా ‘అదానీ’ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన..! – adani hindenburg row centre says no plans to form a committee to probe the adani group


Adani: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ కంపెనీలు ఏ స్థాయిలో పతనమయ్యాయో తెలిసిందే. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ సంచలన నివేదికతో ఒక్కసారిగా కుప్పకూలాయి. అదానీ కంపెనీల షేర్లను ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారని, అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించించింది. దీనిపై దేశంతో పాటు విదేశాల్లోనూ వ్యతిరేకత వచ్చింది. అదానీ గ్రూప్ (Adani Group) సంక్షోభంపై విచారణకు కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. ఈ విషయంపై కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం సంచలన ప్రకటన చేసింది. అదానీ గ్రూప్ సంక్షోభంపై విచారణ చేపట్టేందుకు కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనే లేదని తేల్చి చెప్పింది.

హిండెన్‌బర్గ్ రిపోర్ట్ (Hindenburg Report) ద్వారా ఏర్పాడిన స్టాక్ మార్కెట్ ఒడుదొడులతో సిస్టెమికి లెవల్‌లో ఎలాంటి గణనీయమైన ప్రభావం ఏర్పడలేదన్నారు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ఈ మేరకు పార్లమెంట్‌లో అడిగిన ఓ ప్రశ్నకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రకటన చేశారు.

విపక్షాల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తున్న క్రమంలో ఈ మేరకు పార్లమెంట్‌లో ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికీ ఈ ఆరోపణలపై సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) దర్యాప్తు చేపట్టినట్లు గుర్తు చేసింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు కేంద్రం ఎలాంటి కమిటీని ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు సహాయ మంత్రి పంకజ్ చౌదరి. ‘స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను బలోపేతం చేయడం కోసం సుప్రీం కోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది’ అని తెలిపారు.

మరోవైపు.. అదానీ గ్రూప్ నుంచి విద్యుత్తు తయారీ, పవర్ ట్రాన్స్‌మిషన్, మౌలిక సదుపాయాల ఈక్విప్మెంట్స్‌పై వచ్చి ఆరోపణలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ దర్యాప్తు ముగించింది. ఇండోనేసియా నుంచి అదాన గ్రూప్ చేసిన బొగ్గు దిగుమతులపై డీఆర్ఐ దర్యాప్తు కొనసాగుతోందని పార్లమెంట్‌కు తెలిపింది ఆర్థిక శాఖ.

ఇదీ సంక్షోభం..
అదానీ గ్రూప్ కంపెనీల్లో అవకతవకలు జరుగుతున్నాయని, షేర్లను ఉద్దేశపూర్వకంగా పెంచుతున్నారంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ జనవరి 25, 2023న ఓ నివేదిక విడుదల చేసింది. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలుతూ వచ్చాయి. వాటి మార్కెట్ విలువ మూడు వంతులు పడిపోయింది. దీంతో గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద సైతం భారీగా తగ్గిపోయింది. ఈ కారణంగా ఆయన ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానం నుంచి 30వ స్థానానికి పడిపోయారు. ఇప్పుడిప్పుడే కాస్త కోలుకుంటున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ హిండెన్‌బర్గ ప్రభావం ఇంకా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Adani Power: అదానీ ఇక మరింత ‘పవర్‌’ఫుల్.. ఆ 6 కంపెనీల విలీనం!RBI: అదానీ ఒక్కరే కాదు.. అప్పుల ఊబిలో మరో 20 కంపెనీలు.. రంగంలోకి ఆర్‌బీఐ!Adani సంక్షోభం.. RBI మాజీ గవర్నర్ Raghuram Rajan రాజన్ సూటి ప్రశ్న ఇదే.. ఇక అలాగే చేయాలేమో?



Source link

Latest news
Related news