TTE Pees On Woman: ముఖంపై మూత్ర విసర్జన
అమృతసర్ కు చెందిన రాజేశ్ కుమార్ తన భార్యతో కలిసి అమృతసర్ నుంచి కోల్ కతా కు అకల్ తఖ్త్ ఎక్స్ ప్రెస్ (Akal Takht Express)లో వెళ్తున్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత వీరు ప్రయాణిస్తున్న ఏ1 కోచ్ లోకి మద్యం మత్తులో వచ్చిన మున్నా కుమార్ అనే టీటీఈ (TTE) బెర్త్ పై నిద్ర పోతున్న రాజేశ్ కుమార్ భార్య ముఖంపై మూత్ర విసర్జన (TTE Pees On Woman) చేశాడు. ఆమె అరుపులకు నిద్ర లేచిన ఆమె భర్త రాజేశ్ కుమార్, ఇతర ప్రయాణీకులు మద్య మత్తులో ఉన్న టీటీఈ మున్నాకుమార్ ను పట్టుకుని దేహ శుద్ధి చేశారు. అనంతరం రైలు లక్నోలోని చార్ బాఘ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న తరువాత అతడిని రైల్వే పోలీసుల (GRP)కు అప్పగించారు. రైల్వేలో టీటీఈ గా పని చేస్తున్న మున్నా కుమార్ ది బిహార్ అని రైల్వే పోలీసులు తెలిపారు. ఆ టీటీఈ (TTE) మున్నా కుమార్ ను అరెస్ట్ చేసి, జ్యూడీషియల్ కస్టడీకి పంపించామని తెలిపారు.