Friday, March 31, 2023

Womens IPL | డబ్ల్యూపీఎల్ 2023 ఫస్ట్ మ్యాచ్‌లోనే ముంబయి ఇండియన్స్ భారీ స్కోరుకి కారణమిదేనా?

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 (Womens Premier League 2023) ఫస్ట్ మ్యాచ్‌లోనే భారీ స్కోరు నమోదైంది. గుజరాత్‌ జెయింట్స్ (Gujarat Giants) టీమ్‌తో శనివారం రాత్రి ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) టీమ్ 5 వికెట్ల నష్టానికి ఏకంగా 207 పరుగులు చేసింది. ఇటీవల ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2023లో సగటున 150 పరుగులు చేసేందుకు జట్లు ఆపసోపాలు పడ్డాయి. కానీ.. డబ్ల్యూపీఎల్ 2023లో అది కూడా ఫస్ట్ మ్యాచ్‌లోనే 207 పరుగుల్ని చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యపోయారు. కానీ.. అసలు విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఐపీఎల్ తరహాలో డబ్ల్యూపీఎల్‌ని కూడా హిట్ చేయాలని ఆశిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ముంబయి ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో బౌండరీ లైన్‌ దూరాన్ని 5 మీటర్లు తగ్గించిదట. సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్‌లకి బౌండరీ లైన్ దూరాన్ని డీవై పాటిల్ స్టేడియంలో 70 మీటర్లు ఉంచుతారు. దాంతో.. డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌ల కోసం 65 మీటర్ల దూరంలో బౌండరీ లైన్ ఉంటుందని అంతా భావించారు. కానీ.. అనూహ్యంగా 60 మీటర్లకి బౌండరీ లైన్‌ని బీసీసీఐ కుదించేసింది. ఇటీవల ముగిసిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్ -2022‌లో బౌండరీ లైన్‌ని 65 మీటర్ల దూరంలో ఉంచారు.

ముంబయి జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 30 బంతుల్లోనే 14 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేయగా.. ఓపెనర్ మాథ్యూస్ 31 బంతుల్లో 3×4, 4×6 సాయంతో 47 పరుగులు చేసింది. అలానే కేర్ కూడా 24 బంతుల్లో 6×4, 1×6 సాయంతో 45 పరుగులు చేసింది. కానీ.. గుజరాత్ జెయింట్స్ టీమ్‌లో హేమలత మాత్రమే రెండు సిక్సర్లతో ఫర్వాలేదనిపించింది. ఓవరాల్‌గా ముంబయి జట్టులో 31 ఫోర్లు, 2 సిక్సర్లు నమోదవగా.. గుజరాత్ టీమ్‌లో కేవలం ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లే నమోదయ్యాయి.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news