Thursday, March 30, 2023

national highways, వాహనదారులపై మరో పిడుగు.. Toll Tax భారీగా పెంపు.. ఎప్పటి నుంచి అంటే? – toll tax likely increased from april 1st travelling on nhs and expressway to get expensive


Toll Tax: దేశంలోని వాహనదారులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్ వేలపై ప్రయాణించే ప్రజలు వచ్చే నెల నుంచి మరింత ఎక్కువ చెల్లించాల్సి రాబోతోంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (National Highway Authority of India – NHAI) టోల్ ట్యాక్సులను పెంచనుందని జాతీయ మీడియా పేర్కొంది. ఈ టోల్ ధరలు సుమారు 5 శాతం నుంచి 10 శాతం మేర పెరగనున్నాయని సమాచారం. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న క్రమంలో టోల్ ఛార్జీలు పెంచడం వాహనదారులపై మరింత భారం మోపడమేనని ట్రావెలర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టోల్ ట్యాక్స్ పాలసీ..
నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1న ధరలు సవరించాల్సి ఉంటుంది. అవసరాలను బట్టి సమయానుసారంగా టోల్ సమస్యలపై పాలసీ (Toll Tax Policy) నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది ప్రభుత్వం. మార్చి చివరి వారంలో రహదారుల అథారిటీ చేసే సిఫార్సులను ఉపరితల రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పరిశీలించి ఏప్రిల్ 1న ప్రకటన చేయనుంది.

అధికారవర్గాల సమాచారం ప్రకారం కార్లు (Cars), లైట్ వేట్ వెహికిల్స్‌కు టోల్ ఛార్జీలు (Toll Charges) 5 శాతం మేర పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే హెవీ వాహనాలకు 10 శాతం పెంచనున్నారని తెలుస్తోంది. ఇటీవలే అందుబాటులోకి వచ్చిన డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేకు సైతం టాలో రేట్లను పెంచనుంది కేంద్రం. ప్రస్తుతం డిల్లీ-ముంబాయి ఎక్స్‌ప్రెస్ వేపై కిలోమీటర్‌కు రూ.2.19 వసూలు చేస్తున్నారు. దానిని మరో 10 శాతం పెంచనున్నారు. దీనిపై వాహనాల సంఖ్య సైతం పెరుగుతోంది. ప్రతి రోజు 20 వేల వాహనాలు వెళ్తున్నట్లు సమాచారం. అది వచ్చే ఆరు నెలల్లో 60 వేలకు చేరే అవకాశాలు ఉన్నాయి.

నెల వారీ పాసులు సైతం పెంపు..
టోల్ గేట్ ప్రాంతానికి 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలకు నెలవారీ పాసులు ఇస్తుంటారు. ఇప్పుడు వాటి ఛార్జీలు సైతం దాదాపు 10 శాతం పెంచే ఆలోచనలో ఉంది కేంద్రం. నేషనల్ హైవేస్ ఫీ రూల్స్ 2008 ప్రకారం టోల్ గేటుకు సమీపంలో ఉన్న వారికి సైతం ఎలాంటి మినహాయింపులు లేవు. అయితే, 2022-23 ఆర్థిక ఏడాదిలో అన్‌లిమిటెడ్ ట్రిప్పులతో నెలకి రూ.315తో పాసులు ఇచ్చారు. ఇప్పుడు పాసుల ధరలు సైతం పెంచనున్న నేపథ్యంలో నిత్యం టోల్ గేట్ ద్వారా సొంత పనులకు వెళ్లన వారికి మరింత భారం కానుంది.

గుడ్‌న్యూస్.. సికింద్రాబాద్‌ నుంచి మరో Vande Bharat రైలు.. రూట్ ఇదే!GST Rates: గుడ్‌న్యూస్.. ఇవాళ్టి నుంచి వీటి ధరలు తగ్గుతాయ్..!రైతులకు అలర్ట్.. మీకు PM KISAN డబ్బులు రాలేదా? ఇలా ఫిర్యాదు చేయండి!



Source link

Latest news
Related news