Friday, March 24, 2023

GIS 2023 at Vizag: తొలిరోజు రూ.11 లక్షల కోట్ల పెట్టుబడులు.. 92 ఎంఓయూలపై సంతకాలు

పెట్టుబడుల వివరాలు…

ప్రధాన పెట్టుబడిదారులలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) రూ. 2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. ఏబీసీ లిమిటెడ్ రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఎంఓయూపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధి కల్పించబోతోంది. JSW గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. రూ. 50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ రూ. 21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. అరబిందో గ్రూప్ రూ. 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. దీని ద్వారా 5,250 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ 2,850 మందికి ఉపాధి కల్పించే రూ.9,300 కోట్ల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. జిందాల్ స్టీల్ రూ. 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఎంఓయూపై సంతకం చేసింది. మొదటి రోజు మొత్తం 64 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.

Source link

Latest news
Related news