Friday, March 24, 2023

‘1947లో విడిపోయిన కుటుంబాలు సోషల్ మీడియా వల్ల మళ్లీ కలిశాయి..’-social media reunites sikh family separated at the time of partition


Sikh family reunites at Kartatpur: కర్తార్పూర్ కారిడార్ లో మళ్లీ కలిశారు..

దాంతో, రెండు కుటుంబాలు ఫోన్లలో మాట్లాడుకున్నారు. కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు వేదికగా పవిత్ర కర్తార్పూర్ ఆలయాన్ని ఎంచుకున్నారు. పాకిస్తాన్ లోకి కర్తార్పూర్ కు హరియాణా నుంచి దయాసింగ్ కుటుంబం వెళ్లింది. అక్కడ రెండు కుటుంబాలు ఆనంద భాష్పాల మధ్య కలుసుకున్నారు. డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ, ఒకరిపై ఒకరు పూలు చల్లుకుంటూ , ఒకరిని ఒకరు హత్తుకుంటూ కలిసిపోయారు. తమ రీయూనియన్ కు కారణమైన సోషల్ మీడియాకు ధన్యవాదాలు చెప్పడం మాత్రం మర్చిపోలేదు. కర్తార్పూర్ కారిడార్ పాకిస్తాన్ లోని పంజాబ్ లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్ ను, భారత్ లోని పంజాబ్ లో ఉన్న డేరా బాబా నానక్ ఆలయాన్ని అనుసంధానపరుస్తుంది. 4 కిమీల ఈ కారిడార్ ద్వారా వీసాలు లేకుండానే సిక్కు భక్తులు రెండు పవిత్ర ఆలయాలను దర్శించుకోవచ్చు.



Source link

Latest news
Related news