మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 109 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు 197 పరుగులు చేయగా.. 88 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా గురువారం 163 పరుగులకే ఆలౌటైంది. దాంతో కేవలం 76 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు భారత్ జట్టు నిలపగలిగింది.
ఇండోర్ పిచ్ స్పిన్కి అతిగా అనుకూలిస్తుండగా .. బంతి ఎవరూ ఊహించని విధంగా తిరుగుతోంది. దాంతో బ్యాటింగ్ కష్టమైపోయింది. ఇదే విషయాన్ని చెప్పిన పుజారా.. భారత్ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఇండోర్ పిచ్ బ్యాటింగ్కి చాలా కష్టంగా ఉంది. డిఫెన్స్ని నమ్ముకోవాల్సి ఉంది. అది కూడా అంత సులువు కాదు. నిజమే.. 75 పరుగులు పెద్ద స్కోరు కాదు. కానీ.. భారత్ జట్టుకి గెలిచే ఛాన్స్ ఇంకా ఉంది’’ అని పుజారా చెప్పుకొచ్చాడు.
Read Latest Sports News, Cricket News, Telugu News