Friday, March 24, 2023

IND vs AUS Test | ఇండోర్ టెస్టులో భారత్‌కి ఇంకా గెలిచే ఛాన్స్.. చతేశ్వర్ పుజారా ధీమా

IND vs AUS 3rd Test : ఆస్ట్రేలియాతో ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టుకి గెలిచే అవకాశాలు ఇంకా ఉన్నాయని టెస్టు స్పెషలిస్ట్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా (Pujara) ధీమా వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లో మూడో రోజైన శుక్రవారం 76 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఆస్ట్రేలియా టీమ్ ఆచితూచి ఆడుతోంది. మ్యాచ్‌లో ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో ఆస్ట్రేలియా టీమ్‌ గెలుపు లాంఛనమేనని మాజీ క్రికెటర్లు చెప్తున్నారు. కానీ.. టీమిండియా మాత్రం పోరాడుతోంది.

మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఫస్ట్ ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా జట్టు 197 పరుగులు చేయగా.. 88 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా గురువారం 163 పరుగులకే ఆలౌటైంది. దాంతో కేవలం 76 పరుగుల టార్గెట్ ఆస్ట్రేలియా ముందు భారత్ జట్టు నిలపగలిగింది.

ఇండోర్ పిచ్‌ స్పిన్‌కి అతిగా అనుకూలిస్తుండగా .. బంతి ఎవరూ ఊహించని విధంగా తిరుగుతోంది. దాంతో బ్యాటింగ్‌ కష్టమైపోయింది. ఇదే విషయాన్ని చెప్పిన పుజారా.. భారత్ జట్టు గెలిచే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశాడు. ‘‘ఇండోర్ పిచ్ బ్యాటింగ్‌కి చాలా కష్టంగా ఉంది. డిఫెన్స్‌ని నమ్ముకోవాల్సి ఉంది. అది కూడా అంత సులువు కాదు. నిజమే.. 75 పరుగులు పెద్ద స్కోరు కాదు. కానీ.. భారత్ జట్టుకి గెలిచే ఛాన్స్ ఇంకా ఉంది’’ అని పుజారా చెప్పుకొచ్చాడు.

Read Latest Sports News, Cricket News, Telugu News

Latest news
Related news