PM KISAN: దేశంలోని సుమారు 8 కోట్ల మంది అర్హులైన రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రూ.2 వేలు అందించింది కేంద్ర ప్రభుత్వం. అయితే, చాలా మంది అర్హులైన రైతులకు ఇంకా పీఎం కిసాన్ సాయం 13 వ విడత డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ కాలేదని సమాచారం. అలాంటి పరిస్థితి ఏ రైతుకైనా ఎదురైతే ఏం చేయాలి? పీఎం కిసాన్ డబ్బులు వచ్చేలా ఎవరికి ఫిర్యాదు చేయాలి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.