బ్యాటర్ల ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ప్లేయర్ మార్కస్ లబుషేన్ 912 పాయింట్లతో టాప్లో నిలవగా.. భారత క్రికెటర్లలో రిషబ్ పంత్ (781 పాయింట్లు), రోహిత్ శర్మ (777) వరుసగా 8, 9వ స్థానాల్లో నిలిచారు. ఇక బౌలింగ్ ర్యాంకింగ్స్లో అశ్విన్ 864 పాయింట్లతో నెం.1 స్థానంలో నిలవగా.. జస్ప్రీత్ బుమ్రా (795) నాలుగో స్థానం, రవీంద్ర జడేజా (763) ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నారు. అలానే ఆల్రౌండర్ల లిస్ట్లో రవీంద్ర జడేజా 460 పాయింట్లతో టాప్లో నిలిచాడు. ఇక అశ్విన్ 376 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా.. మరో ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 283 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఓవరాల్గా మూడు కేటగిరీల్లో టాప్-10లో నిలిచిన భారత క్రికెటర్లు వీళ్లే.
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఈరోజు నుంచి ఇండోర్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. అనంతరం మార్చి 9 నుంచి అహ్మదాబాద్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ రెండు టెస్టుల్లో సత్తాచాటితే? అశ్విన్, జడేజా ఆయా కేటగిరీల్లో టాప్లో కొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది.