Bypoll results: ఉప ఎన్నికల ఫలితాలు కూడా..
మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు, తమిళనాడు లోని ఈరోడ్ స్థానానికి, పశ్చిమబెంగాల్ లోని సాగర్ధిఘి స్థానానికి, జార్ఖండ్ లోని రామ్ గఢ్ స్థానానికి, మహారాష్ట్రలోని కస్బాపథ్, చించ్వాడ్ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా మార్చి 2న వెల్లడి కానున్నాయి. మహారాష్ట్రలో శివసేనను చీల్చి ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రి అయిన తరువాత జరిగిన ఈ ఎన్నికల్లో విజయం సాధించడం అటు షిండేకు, ఇటు ఉద్ధవ్ ఠాక్రేకు అత్యంత కీలకంగా మారింది. మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీలు అధికార కూటమిగా ఉన్నాయి. కానీ, ఈ ఎన్నికల్లో మాత్రం వేరువేరుగా పోటీ చేశాయి.