Sisodia resigns: మళ్లీ వస్తా..
తాత్కాలికంగానే పదవులకు దూరమవుతున్నానని, నిర్దోషులుగా తేలిన తరువాత మళ్లీ బాధ్యతలను స్వీకరిస్తానని మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా 8 ఏళ్ల పాటు నిజాయితీగా, నిబద్ధతతో సేవలను అందించానని, తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలను తేలేంత వరకు పదవులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తనపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందన్నారు. తాను తప్పేం చేయలేదన్నది ఆ దేవుడికి తెలుసన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవినీతికి సంబంధించి నమోదైన కేసులో ఆదివారం సీబీఐ మనీశ్ సిసోడియాను అరెస్ట్ చేసింది. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేస్తారని, కనీసం 8 నెలలు జైళ్లో ఉంచుతారని అరెస్ట్ కు ముందే సిసోడియా అంచనా వేశారు. సత్యేంద్ర జైన్ గత 10 నెలలుగా జైళ్లోనే ఉన్నారు.