Rahul Gandhi to address Cambridge University: కేంబ్రిడ్జ్ నుంచి ఆహ్వానం రావడంతో..
భారత్ జోడో యాత్ర సమయంలో రాహుల్ గాంధీ గడ్డంపై బీజేపీ విమర్శలు కూడా చేసింది. ఇరాక్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ తో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. అయితే, అవేమీ రాహుల్ పట్టించుకోలేదు. భారత్ జోడో యాత్ర ముగిసిన తరువాత కూడా రాహుల్ గాంధీ గడ్డం తీయలేదు. ట్రిమ్ కూడా చేయలేదు. అదే పెద్ద గడ్డం కొనసాగించారు. అయితే, తాజాగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం రావడంతో, రాహుల్ గాంధీ ఆ గడ్డాన్ని కాస్త ట్రిమ్ చేయాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు, ఆ గడ్డాన్ని ట్రిమ్ చేసి, హెయిర్ కట్ చేసుకుని, కొత్త లుక్ తో ఆయన ఫ్రెష్ గా కనిపిస్తున్నారు.