Friday, March 31, 2023

vistara airlines, విస్తారా ఉండదిక.. అంతా Air Indiaనే!.. మెగా డీల్‌పై సీఈఓ కీలక ప్రకటన – ceo campbell wilson says air india to let go of vistara brand post merger


Air India: ప్రపంచంలోనే అతి పెద్ద విమానయాన సంస్థగా అవతరించేందుకు టాటాల నేతృత్వంలోని ఎయిరిండియా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవలే భారీ స్థాయిలో 470 విమానాల కొనుగోలు కోసం మెగా డీల్‌ను కుదుర్చుకుంది. దీంతో పాటు విస్తారా (Vistara Airlines) విలీనంపైనా దృష్టి సారించింది. అయితే, ఈ విలీనం తర్వాత సంస్థను ఎయిరిండియాగానే వ్యవహరిస్తామని కంపెనీ సీఈఓ, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ (Campbell Wilson) తెలిపారు. విదేశాల్లో ఎయిరిండియాకు ఆ స్థాయిలో గుర్తింపు ఉందని, అదే ప్రధాన కారణంగా తెలిపారు. ఈ డీల్ ప్రాముఖ్యత, భవిష్యత్తు మార్కెట్ వ్యూహం, మార్కెట్లో ఎయిరిండియా పాత్రపై మాట్లాడారు.

‘విస్తారా ఎయిర్‌లైన్స్‌కు దేశీయ మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది. అయితే, అంతర్జాతీయంగా ఎయిరిండియాకు అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉంది. 90 ఏళ్ల చరిత్ర కలిగిన ఎయిరిండియా పేరు విలీన సంస్థకూ కొనసాగించనున్నా. మరోవైపు విస్తారా వారసత్వాన్ని కొంత మేర విలీన సంస్థలోనూ కొనసాగించాలనుకుంటున్నాం.’ అని పేర్కొన్నారు ఎయిరిండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్. ప్రస్తుతం ఈ విలీన ప్రక్రియ కాంపీటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) వద్ద పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ఎయిరిండియాలో విస్తారాను విలీనం (Merger) చేస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రకటించింది. ప్రస్తుతం సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి టాటా గ్రూప్ విస్తారాను నడుపుతోంది. విస్తారాలో టాటాలకు 51 శాతం వాటా ఉంది. మిగిలిన వాటా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు ఉంది. 2024 మార్చి నాటికి విలీన ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది ఎయిరిండింయా.

భారీగా ఉద్యోగాల కల్పన..
ఇటీవలే 470 విమానాల కొనుగోలు కోసం మెగా డీల్ (Air India Mega Deal) కుదుర్చుకుంది ఎయిరిండియా. ఈ క్రమంలో ఇటీవలే 900 మంది పైలట్లు, 4100 క్యాబిన్ సిబ్బందిని నియమించుకుంటామని ప్రకటించింది. నెలకు 100 మంది పైలట్లు, 500 మంది క్యాబిన్ క్రూను సంస్థలోకి నియమించుకుంటామని పేర్కొంది. మరోవైపు.. నాన్ ఫ్లైయింగ్ పొజిషన్‌లతో 1500 మందికిపైగా సంస్థలో ఇటీవలే చేరారని విల్సన్ చెప్పారు.

ఈ క్రమంలో మరో 370 విమానాలను కొనుగోలు చేసి ఆర్డర్ పరిమాణాన్ని 840 ఎయిర్ క్రాఫ్టులకు పెంచాలని ఎయిరిండియా పరిశీలిస్తున్నట్లు సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు. 2025 నుంచి పదేళ్లలో సేవలను గరిష్ఠ స్థాయికి చేర్చాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడు ప్రధాన కేంద్రాల ఏర్పాటుకు చర్యలు సహా పైలట్లు, క్యాబిన్ క్రూ, గ్రౌండ్ స్పెషలిస్టుల కోసం శిక్షణ సౌకర్యాల ఏర్పాటు వంటివి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.

Air India గుడ్‌న్యూస్.. 5 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు.. రూ.2 కోట్ల వరకు ప్యాకేజీ!Air India బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ.2 కోట్లు జీతంతో జాబ్స్.. వారి పంట పండినట్లే!Air India ఇంజిన్ నుంచి ఆయిల్ లీక్.. స్టాక్‌హోమ్‌లో నెవాక్-ఢిల్లీ ఎయిరిండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్



Source link

Latest news
Related news