Tuesday, March 21, 2023

T20 WC: 74 పరుగులతో చెలరేగిన మూనీ.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం

Authored by Srinivas Gangam | Samayam Telugu | Updated: 26 Feb 2023, 8:42 pm

Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టుకు ఆస్ట్రేలియా 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాట్స్‌విమెన్ మూనీ చెలరేగి ఆడింది. మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. జట్టుకు భారీ స్కోరు అందించింది. అగ్రశ్రేణి బౌలర్లతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికా చెమటోడ్చాల్సిందే.

 

మహిళల ప్రపంచ కప్

ప్రధానాంశాలు:

  • మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చెలరేగి ఆడిన ఆస్ట్రేలియా
  • ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరు అందించిన మూనీ
  • దక్షిణాఫ్రికా ముందు 157 పరుగుల లక్ష్యం.
మహిళల టీ20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫేవరేట్ జట్టు ఆసీస్ దూకుడు కొనసాగించింది. సౌతాఫ్రికా ముందు భారీ స్కోరు ఉంచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టు.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినా దూకుడు తగ్గలేదు. ముఖ్యంగా బేత్ మూనీ ఆకాశమే హద్దుగా చెలరేగింది. 53 బంతుల్లో 74 పరుగులు (9 ఫోర్లు, 1 సిక్స్) చేసింది. మూనీ మినహా.. మిగతా ఆటగాళ్లందరూ 30 కంటే తక్కువే పరుగులు చేశారు. గార్డ్‌నర్ 29 పరుగులు (21 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసింది. ఆ తర్వాత గరిష్ట స్కోరు 18 మాత్రమే. ఆస్ట్రేలియా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా ముందు 157 పరుగుల లక్ష్యం ఉంచారు.

కెప్టెన్ లానింగ్, గ్రేస్ హారిస్ తలో 10 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజన్నె కాప్ 2, షబ్నిమ్ ఇస్మాయిల్ 2 వికెట్లు తీయగా.. మ్లాబా, ట్రయాన్ తలో వికెట్ తీశారు. అగ్రశ్రేణి బౌలర్లతో పటిష్టంగా ఉన్న ఆస్ట్రేలియాను ఓడించాలంటే సౌతాఫ్రికా చెమటోడ్చాల్సిందే. దక్షిణాఫ్రికా గెలిస్తే.. ఆ దేశానికి ఇదే తొలి ప్రపంచకప్ ట్రోఫీ అవుతుంది.

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

టీ20 వరల్డ్ కప్ 2022 వార్తలు, అక్టోబరు 16 నుంచి నవంబరు 13 వరకూ ఈ మెగా టోర్నీ జరగనుంది. ఆస్ట్రేలియాలోని ఏడు వేదికల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించబోతున్నారు. అక్టోబరు 16 నుంచి నవంబరు 6 వరకూ గ్రూప్ దశ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబరు 9, 10న సెమీ ఫైనల్స్, నవంబరు 13న మెల్‌బోర్న్‌లో ఫైనల్ జరగనుంది.

Latest news
Related news