NEET PG postponement news : ఈ వ్యవహారంపై జస్టిస్ ఎస్ ఆర్ భట్, జస్టిస్ దిపంకర్ దత్తతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ తరఫున వాదనలు వినిపించిన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భటి.. పరీక్షను వాయిదా వేయడం సరైనది కాదని పేర్కొన్నారు. అంతా షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, మార్చ్ 5న జరగాల్సిన పరీక్షను వాయిదా వేస్తే.. సమీప భవిష్యత్తులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుని మరో తేదీన ఎగ్జామ్ను నిర్వహించడం టెక్నికల్గా కష్టం అవుతుందని వివరించారు. ఇరు పక్షాల వాధనలు విన్న అత్యుత్తమ న్యాయస్థానం.. నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయకూడదని నిర్ణయించింది.