Agnipath Scheme: అగ్నిపథ్ పథకాన్ని ఆపేయాలంటే గతేడాది పలు న్యాయస్థానాల్లో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని సుప్రీం కోర్టు.. ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేసింది. కేరళ, హర్యానాతో పాటు మరిన్ని హైకోర్టులను కూడా ఢిల్లీ న్యాయస్థానానికి పిటిషన్లను ట్రాన్స్ఫర్ చేయాలని, లేకపోతే తీర్పును పెండింగ్లో ఉంచాలని సూచించింది. అగ్నిపథ్ను నిలుపదల చేసేందుకు తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్ల విచారణను గతేడాది ఆగస్టులో ప్రారంభించింది.