వేగంగా వచ్చి ఢీకొని..
Uttar Pradesh’s Mahoba accident: ఈ ప్రమాదంలో బాలుడు సాత్విక్ (6), ఉదిత్ నారాయణ్ చన్సోరియా (67) మృతి చెందారు. వీరిది మహోబాలోని హమిర్పూర్ చుంగి. శనివారం వారిద్దరూ స్కూటీపై మార్కెట్కు వెళుతుండగా.. స్పీడ్గా వచ్చిన ఓ ట్రక్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఉదిక్ అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ట్రక్ ముందు భాగంలో బంపర్కు స్కూటర్ ఇరుక్కుంది. బాలుడు సాత్విక్ కూడా చిక్కుకుపోయాడు. స్కూటర్ చిక్కుకోపోయినా.. ట్రక్ డ్రైవర్ ఆపకుండా వేగంగా నడిపాడు. దీంతో స్కూటర్తో పాటు బాలుడిని ఆ ట్రక్ సుమారు 2 కిలోమీటర్ల వరకు లాక్కెళ్లింది. దీంతో ఆ పిల్లాడు కూడా చనిపోయాడు. కాన్పూర్ – సాగర్ నేషనల్ హైవే 86పై ఈ దారుణం జరిగింది.